News June 19, 2024

కడప: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. రైల్వే సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కడప – కనుమలోపల్లి మార్గమధ్యంలో ఓ మహిళ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి రావడంతో అదే మార్గంలో వెళ్తున్న గూడ్స్ ఢీకొని మృతి చెందినట్లు రైల్వే సీఐ నాగార్జున తెలిపారు. ఫోటోలో కనబడుతున్న మహిళ మృతదేహం ఆనవాళ్లను ఎవరైనా గుర్తించినట్లయితే కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు.

Similar News

News November 22, 2025

కడప: వీరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు

image

కడప జిల్లాలోని ఇద్దరికి కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించింది. వీరిలో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్‌కు ఏపీ స్టేట్ షేక్/షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే కడపకు చెందిన యాతగిరి రాంప్రసాద్‌ను ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

News November 22, 2025

YVUలో అతిథి ఫ్యాకల్టీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు

image

YVU కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు PHD/MTech (ఏదైనా కంప్యూటర్ స్ట్రీమ్)/ఎంసీఎ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం YVU అధికార వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

News November 22, 2025

కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

image

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.