News June 19, 2024

కడప: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. రైల్వే సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కడప – కనుమలోపల్లి మార్గమధ్యంలో ఓ మహిళ ఇవాళ ఉదయం అకస్మాత్తుగా రైలు పట్టాల పైకి రావడంతో అదే మార్గంలో వెళ్తున్న గూడ్స్ ఢీకొని మృతి చెందినట్లు రైల్వే సీఐ నాగార్జున తెలిపారు. ఫోటోలో కనబడుతున్న మహిళ మృతదేహం ఆనవాళ్లను ఎవరైనా గుర్తించినట్లయితే కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు.

Similar News

News November 20, 2025

కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

image

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.

News November 20, 2025

కడప జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

కడప జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 19, 2025

జమ్మలమడుగు వైసీపీ ఇన్‌‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి

image

జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్‌ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్‌ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌ పదవి ఇచ్చింది.