News April 6, 2024
కడప: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

శుభకార్యాయానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన దువ్వూరు మండలంలో జరిగింది. పోలీసులు వివరాల మేరకు.. భీమునిపాడుకు చెందిన యేసయ్య, సుజాత దంపతులు ఏకో పల్లిలో జరిగిన బంధువుల శుభకార్యాయానికి వెళ్లారు. గురువారం రాత్రి బైక్పై తిరిగి వస్తుండుగా గుర్త తెలియని వాహనం వీరి బైక్ను ఢీ కొంది. క్షతగాత్రులను 108వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో యేసయ్య, ప్రొద్దుటూరులో సుజాత మృతి చెందారు.
Similar News
News December 5, 2025
కడప జిల్లా రైతు సూసైడ్..!

సింహాద్రిపురం మండలం బలపనూరులో శుక్రవారం ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని రైతు నాగేశ్వర రెడ్డి (63) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తన రెండు ఎకరాల పొలంలో పంటలు పండక అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు అధికం కావడంతోపాటు తన భార్య అనారోగ్యంతో బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో మనస్థాపం చెందిన నాగేశ్వర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00


