News September 18, 2024

కడప: వరద బాధితులకు 1వ తరగతి విద్యార్థిని విరాళం

image

విజయవాడ వరద సహాయక చర్యల నిమిత్తం 1వ తరగతి విద్యార్థిని తన పాకెట్ మనీని విరాళంగా అందించింది. వివరాలిలా ఉన్నాయి. పులివెందులకు చెందిన ఒకటో తరగతి విద్యార్ధిని ఎం.వర్ణిక వరద బాధితులను చూసి చలించి పోయింది. వారికి సహాయం చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తన బాబాయి ప్రణీత్ కుమార్‌తో కలిసి బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌కు తన పాకెట్ మనీ రూ.72,500 విరాళంగా అందించింది.

Similar News

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏకు బెయిల్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కడప పోలీసులు ఆయనను <<17897036>>అరెస్ట్<<>> చేశారు. ఈ క్రమంలో కోర్టులో ప్రవేశపెట్టగా ఖాజాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది.

News October 2, 2025

వేముల : పెరిగిన చామంతి పూల ధరలు

image

ప్రస్తుతం మార్కెట్‌లో చామంతి ధరలు పెరిగాయి. బయట మార్కెట్లో కిలో చామంతి పూలు రూ. 70ల నుంచి రూ.80లు పలుకుతున్నాయి. చామంతి పూలను ఎక్కువగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం చామంతి ధరలు పడిపోయాయి. దసరా, దీపావళి పండుగలతోపాటు కార్తీకమాసం నేపథ్యంలో చామంతి ధరలు పెరిగాయి. దీంతో రైతులు తోటల వద్ద చామంతి పూలను కోసి మార్కెట్లకు తరలిస్తున్నారు.

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష పీఏ అరెస్ట్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష వ్యక్తిగత సహాయకుడు షేక్ ఖాజాను కడప వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలతో ఉన్న వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలతో ఆయనను హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున కడప నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకుని వచ్చారు. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.