News April 4, 2024
కడప: శ్రీనివాస్ యాదవ్ హత్య కేసులో సిట్ ఏర్పాటు

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో SP సిద్దార్థ్ కౌశల్ సిట్ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని వీఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 18, 2025
23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.
News December 18, 2025
వేంపల్లిలో మైనర్ బాలిక ప్రసవం

వేంపల్లిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలికకు నొప్పులు రావడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రసవం చేశారు. ప్రస్తుతం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 18, 2025
AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.


