News November 15, 2024

కడప: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా టాస్క్ ఫోర్స్

image

అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైయస్ జగన్ ఆదేశాలతో కడప జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రతినిధులుగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మేయర్ సురేశ్ బాబు గురువారం నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ.. కార్యకర్తలకు న్యాయ, సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా కల్పించడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పని చేస్తాయన్నారు.

Similar News

News October 19, 2025

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై వేటు

image

పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అతడిపై అనేక అవినీతి ఆరోపణలు రావడం, ఇతని ప్రవర్తనపై కూడా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

News October 18, 2025

కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

image

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.