News January 21, 2025
కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News October 23, 2025
కడప: తుఫాన్.. విద్యుత్ సమస్యలపై కాల్ చేయండి.!

వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440,
*కడప డివిజన్ -99017 61782
*పులివెందుల – 78930-63007
*ప్రొద్దుటూరు -78932-61958
*మైదుకూరు-98490 57659
విద్యుత్ ప్రమాదాలు జరిగితే పై నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
News October 23, 2025
కడప జిల్లా నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.
News October 22, 2025
కడప జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు

కడప జిల్లాలో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ డీఈవో శంషుద్దీన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ కూడా పలు మండలాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.