News September 18, 2024

కడప: 19 నుంచి AP ఆన్లైన్ శాండ్ పోర్టల్ ప్రారంభం

image

ఈనెల 19 నుంచి ఏపీ ఆన్‌లైన్ శాండ్ పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ, రవాణాదారుల జాబితా పొందుపరిచే ప్రక్రియ, బల్క్ వినియోగదారుల ఇసుక అవసరాన్ని ముందుగానే వెరిఫికేషన్‌ను భూగర్భ శాఖ ద్వారా జేసీ లాగింగ్‌కు పంపించాలని తెలిపారు.

Similar News

News July 9, 2025

ముద్దనూరులో యాక్సిడెంట్

image

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

News July 9, 2025

Y.S జగన్‌కు మరో పదవి

image

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.

News July 9, 2025

కడప అభివృద్ధిపై జిల్లాస్థాయి సమావేశం

image

కడప కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. కడప మరింత వేగంగా అభివృద్ధి చెందేలా కార్యాచరణను సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి తదితరులు ఉన్నారు.