News May 4, 2024
కడప: 2004 తర్వాత ఆ నియోజకవర్గం మాయం

కడప జిల్లాల్లో 1955లో శాసనసభకు ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అప్పట్లో మన జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 2004 వరకు కొనసాగాయి. జిల్లాల పునర్విభజన కారణంగా 2004లో ఒక నియోజకవర్గంగా ఉన్న లక్కిరెడ్డిపల్లెను తప్పించారు. ఇందులో ఉన్న మండలాలను రాజంపేట, రాయచోటిలోకి కలపడంతో ఆ నియోజకవర్గం కనుమరుగైంది. ఈ లక్కిరెడ్డిపల్లె మొదటి ఎమ్మెల్యే కడప కోటిరెడ్డి. చివరి ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి(కాంగ్రెస్).
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.