News July 11, 2024

కడప: 23 మంది మద్యం ప్రియులకు జరిమాన

image

కడపలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 23 మందికి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించిందని కడప ట్రాఫిక్ సీతారామరెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచామన్నారు. న్యాయస్థానం వారికి జరిమానా విధించింది. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ CI V. సీతారామిరెడ్డి తెలిపారు.

Similar News

News October 2, 2024

జాతీయ సేవకులకు వైవీయూ పురస్కారాలు

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి యూనివర్శిటి స్థాయి జాతీయ సేవా పథక పురస్కారాలను ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసీ ప్రొ. కె.కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. రఘునాథ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా.వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News October 1, 2024

కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు

image

కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.