News January 17, 2025
కడప: 23, 24 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ – 2025

కడప నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈనెల 23, 24 తేదీల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా స్పోర్ట్స్ మీట్ -2025 నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ మీట్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్ రేస్, కబడ్డీ, బాడ్మింటన్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నెల 21లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News November 26, 2025
కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.
News November 26, 2025
కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
News November 26, 2025
ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


