News March 27, 2025
కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Similar News
News October 29, 2025
వికారాబాద్: పాపం తడుస్తూ ఇంటికి వెళ్లారు..!

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్న తర్వాత క్లాస్రూమ్ల్లోకి వెళ్లి పరీక్షలు రాస్తుండగా, మధ్యంతరంగా విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు.విద్యార్థులు వర్షంలో ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే సెలువుపై అధికారులు నిర్ణయం తీసుంటే బాగుండేదని తల్లిదండ్రులు అంటున్నారు.
News October 29, 2025
పుట్టపర్తిలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. కొత్తచెరువు పూజారి వీధిలో దొంగలు ఉన్నారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.5 తులాల బంగారం, 1250 గ్రాముల వెండి, 4 ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వడిషన వేణుగోపాల్ రెడ్డి, చిన్నం ఆదెమ్మలపై రాష్ట్రంలోని పలుచోట్ల చోరీ కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు.
News October 29, 2025
గాజాపై దాడులు.. 60 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.


