News May 24, 2024
కడప: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.
Similar News
News October 30, 2025
PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
News October 30, 2025
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 30, 2025
ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.


