News January 1, 2025

కడియం: 4న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

image

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.

Similar News

News January 21, 2025

గోకవరం: నేరస్థుడికి ఐదేళ్లు జైలు-ఎస్సై

image

గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు రూ.22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ లలిత విధిస్తూ తీర్పునిచ్చారు. 2015 సంవత్సరంలో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజమండ్రి కోర్టులో నేరం రుజువు చేయడంతో శిక్ష పడినట్లు గోకవరం ఎస్సై సోమవారం తెలిపారు.

News January 20, 2025

సీఎం, డిప్యూటీ సీఎంకు హరిరామ జోగయ్య లేఖ

image

మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కి లేఖ రాశారు. కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. వైసీపీ కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి రిజర్వేషన్ అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో తాను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

News January 20, 2025

యువకుడితో మృతితో పేరవరంలో విషాద ఛాయలు

image

ప్రత్తిపాడు(M) ధర్మవరం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో శివ(22) అనే యువకుడు <<15196950>>మృతి చెందిన<<>> సంగతి తెలిసిందే. బైక్‌పై నిదానంగానే వెళ్తున్నా మృత్యువు లారీ రూపంలో వచ్చి బలితీసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. వెళ్లొస్తా అంటూ హుషారుగా ఇంట్లో చెప్పి వెళ్లిన కుర్రాడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం పేరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.