News February 7, 2025
కడెం: ఉరేసుకొని వ్యక్తి మృతి

వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. కడెం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్ పేట్ గ్రామానికి చెందిన కటికనపెల్లి నాగన్న (49) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
నరదృష్టిని తొలగించే స్తోత్రం

కాళికే పాపహరిణి దృష్టిదోష వినాశిని ।
శత్రు సంహారిణి మాతా రక్ష రక్ష నమోస్తుతే ॥
మనపై, మన ఇల్లు, వ్యాపారం వంటి వాటిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు, ఆ దృష్టి దోషాల నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తారు. శత్రు భయం, నెగటివ్ ఆలోచనల నుంచి ఇది మనల్ని విముక్తుల్ని చేస్తుంది. రోజూ పఠిస్తే.. ఆటంకాలు తొలగిపోయి, అమ్మవారి రక్షణ ఎప్పుడూ ఉంటుందని, జీవితం సుఖశాంతులతో సాగుతుందని పండితులు చెబుతున్నారు.
News November 24, 2025
నేడు కొత్త CJI ప్రమాణ స్వీకారం.. తొలిసారి విదేశీ అతిథుల రాక

53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.


