News January 31, 2025
కడెం: కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుడిగా రమేశ్

ADB పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడిగా మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన బుర్ర రమేశ్ గౌడ్ నియామకమయ్యారు. గురువారం ఎంపీ గోడం నగేశ్ నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నియామకానికి కృషి చేసిన ఎంపీ నగేశ్కి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 8, 2026
HYDలో నేను ఎక్కడ నడవాలి? చెప్పండి ప్లీజ్!

‘నాకు కారులేదు. బండి లేదు. సైకిల్ కూడా లేదు. అందుకే నేను నడుచుకుంటూ వెళ్లాలి. మరి ఎలా వెళ్లాలి? మహానగరంలో ఎక్కడ చూసినా రోడ్లే. నేను నడవాలంటే రోడ్లపై నడవాల్సిందేనా? సిటీలో దాదాపు 10వేల KM రోడ్లు ఉంటే నడవడానికి 550 KM ఫుట్పాత్ ఉంది. ఇదేం పద్ధతి? ఎక్కడ చూసినా ఆక్రమణలే.. వ్యాపారులు, సామగ్రి, పాన్ డబ్బాలు ఆక్రమించాయి? నేను నడిచేందుకు దారి చూపించండి సార్.. అంటూ ఓ నగరవాసి చేసిన విన్నపం ఇది.
News January 8, 2026
ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.
News January 8, 2026
వాట్సాప్ కొత్త ఫీచర్లు: మెంబర్ ట్యాగ్స్, టెక్స్ట్ స్టిక్కర్స్

వాట్సాప్ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇకపై గ్రూప్ చాట్స్లో ఎవరి పాత్ర ఏంటో తెలిపేలా ‘మెంబర్ ట్యాగ్స్’ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక గ్రూప్లో ‘కెప్టెన్’ అని, మరో గ్రూప్లో ‘అమ్మ’ అని ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఏ పదాన్నైనా తక్షణమే స్టిక్కర్గా మార్చే ‘టెక్స్ట్ స్టిక్కర్స్’, ముఖ్యమైన మీటింగ్స్ లేదా పార్టీలను గుర్తు చేసేలా ‘ఈవెంట్ రిమైండర్స్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.


