News January 31, 2025
కడెం: కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుడిగా రమేశ్

ADB పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడిగా మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన బుర్ర రమేశ్ గౌడ్ నియామకమయ్యారు. గురువారం ఎంపీ గోడం నగేశ్ నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నియామకానికి కృషి చేసిన ఎంపీ నగేశ్కి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 9, 2025
కరీంనగర్: కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామానికి చెందిన అమరగొండ వీరయ్య (75) అనే వృద్ధుడు ఆదివారం తెల్లవారుజామున చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ సీహెచ్. తిరుపతి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు.
News February 9, 2025
గిల్ ఉంటే రో‘హిట్’

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.
News February 9, 2025
నిర్మల్ జిల్లా నేటి TOP NEWS

★ బైంసా: రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి ★ నిర్మల్: నులిపురుగుల మాత్రల పంపిణీ వాయిదా ★ రేపు నిర్మల్లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన ★ సిరిపల్లి చెక్ పోస్ట్ వద్ద రూ 1,53,000 నగదు పట్టివేత★ ముధోల్ ఇంటి నిర్మాణం తవ్వకాల్లో ఔరంగజేబు కాలంనాటి నాణేలు