News March 15, 2025

కడెం: గ్రూప్-3 ఫలితాల్లో మెరిసిన తండా యువకుడు

image

గ్రూప్-3 ఫలితాల్లో కడెం మండలంలోని చిన్న బెల్లాల్ తండాకు చెందిన భుక్యా శశికుమార్ ప్రతిభ కనబరిచాడు. 306 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్, జనరల్ కోటాలో 58వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యమున-కిషన్ దంపతుల కుమారుడు శశికుమార్ గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గ్రూప్-3లో ప్రతిభ కనబరిచిన శశి కుమార్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 15, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మ‌ృతి

image

అంతర్ రాష్ట్ర రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మానవపాడు మం. చెన్నిపాడుకి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి (34) తన తల్లి సుబ్బమ్మతో కలిసి కలుగొట్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అలంపూరు చౌరస్తా నుంచి శాంతినగర్ వెళ్లేదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

News March 15, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐ‌ఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 15, 2025

మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

image

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.

error: Content is protected !!