News February 5, 2025

కడెం: ‘పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి’

image

మండలంలోని ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి చైతన్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎంపీవో కవిరాజుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 18, 2025

మల్లాపూర్లో పర్యటించిన డీఆర్డీవో పీడీ

image

మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్, ఓబులాపూర్, దామరాజుపల్లి గ్రామాల్లో మంగళవారం DRDO PD రఘువరన్ పర్యటించారు. హుస్సేన్ నగర్, ఓబులాపూర్ నర్సరీలను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్ట్యా షేడ్ నెట్ లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కొత్త దామరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణాన్ని సందర్శించారు. ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News February 18, 2025

పెద్దగట్టు: లింగమంతుల స్వామికి MLC కవిత బోనం

image

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామిని మంగళవారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మహిళలు కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కవిత వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బాలరాజు, మద్ది శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

News February 18, 2025

పుష్ప-2 కలెక్షన్లు ఎంతంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. గతేడాది DEC 5న రిలీజై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీని సుకుమార్ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘పుష్ప-2’ స్ట్రీమింగ్ అవుతోంది.

error: Content is protected !!