News February 9, 2025
కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News October 21, 2025
VJA: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్షియల్, సోషల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23లోపు https://crda.ap.gov.in/లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.
News October 21, 2025
నరసరావుపేట: ‘DA జీవోను సవరించాలి’

DA జీవోను వెంటనే సవరించాలని AISTF సంఘం జాతీయ కార్యదర్శి జోసెఫ్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో నాయకులు పెదబాబు, సుబ్బారెడ్డి మాట్లాడారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన DA బకాయిలను 2027-28 సంవత్సరం నుంచి 12 దఫాలలో చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను హరించడమేనని విమర్శించారు. దీపావళి కానుక అని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 21, 2025
పాలమూరు: వీరులకు వందనం.. మిమ్మల్ని మరవం!

శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన SP జి.పరదేశి నాయుడు బృందం త్యాగం చిరస్మరణీయం. 1993లో సోమశిల వద్ద PWG ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి వస్తున్న బస్సును సుద్దగట్టు వద్ద పేల్చివేసిన నక్సల్స్, మొత్తం 10 మందిని పొట్టనబెట్టుకున్నారు. SPతో పాటు 2SIలు, 2HCలు, 5PCలు, డ్రైవర్ షాలి పాషా అమరులయ్యారు. వారి వీరత్వానికి, చూపిన తెగువకు జిల్లా శిరస్సు వంచి నమస్కరిస్తోంది.
#నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం