News February 9, 2025
కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.
News November 26, 2025
HYDను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్గా నిలపాలి: సీఎం

హైదరాబాద్ను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్గా నిలపాలని ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న రోడ్డు నెట్వర్క్, పోర్ట్ కనెక్టివిటీ, సంస్కృతి, వాతావరణం వంటి అనుకూలతలను ప్రపంచానికి చాటాలన్నారు. అలాగే రామప్ప నుంచి సమ్మక్క- సారక్క, నల్లమల్ల పులులు, తెలంగాణ ప్రముఖులు- అన్నీ రాష్ట్ర బ్రాండింగ్లో ప్రతిఫలించాలని సూచించారు.
News November 26, 2025
HYDను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్గా నిలపాలి: సీఎం

హైదరాబాద్ను అంతర్జాతీయ పెట్టుబడుల హబ్గా నిలపాలని ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ఉన్న రోడ్డు నెట్వర్క్, పోర్ట్ కనెక్టివిటీ, సంస్కృతి, వాతావరణం వంటి అనుకూలతలను ప్రపంచానికి చాటాలన్నారు. అలాగే రామప్ప నుంచి సమ్మక్క- సారక్క, నల్లమల్ల పులులు, తెలంగాణ ప్రముఖులు- అన్నీ రాష్ట్ర బ్రాండింగ్లో ప్రతిఫలించాలని సూచించారు.


