News February 9, 2025

కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News November 20, 2025

ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

image

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News November 20, 2025

వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

image

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.

News November 20, 2025

నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

image

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్‌ కోసం వేచి ఉండండి.