News January 26, 2025
కడ్తాల్ గ్రామస్థుల సమస్యలు తీరుస్తాం: నిర్మల్ కలెక్టర్

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కొన్ని రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కడ్తాల్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థులు ఆందోళన చెందవద్దని, తప్పకుండా వారి సమస్యలను తీరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News November 20, 2025
జగిత్యాల: ‘గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి’

గ్రామపంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. తుది ఓటర్ లిస్ట్పై వచ్చిన అభ్యంతరాలను 22వ తేదీలోపు పరిష్కరించాలని, 23 నాటికి పోలింగ్ స్టేషన్లు, ఫొటో ఓటర్ జాబితా ప్రకటించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, SP అశోక్ కుమార్ పాల్గొన్నారు.
News November 20, 2025
యడ్లపల్లిలో తల్లిని చంపి కూతురు పరార్..!

చుండూరు మండలం యడ్లపల్లిలో బుధవారం తల్లిని కూతురు చంపిన ఘటన చోటుచేసుకుంది. చుండూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ దయావతి (84)ని ఆమె కూతురు లక్ష్మీ భవాని కుంకుడుకాయలు కొట్టే రాయితో తలపై కొట్టి హత్య చేసింది. హత్య అనంతరం కూతురు పరారైంది. స్థానికులు ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. నిందితురాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
News November 20, 2025
VKB: నార్మల్ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి: స్వర్ణ కుమారి

సిజరిన్ డెలివరీలు కాకుండా నార్మల్ డెలివరీలు అయ్యేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయన వైద్య సిబ్బందితో డాక్టర్లతో సమావేశమై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలకు సరైన విధంగా సేవలందించాలన్నారు.


