News January 26, 2025

కడ్తాల్ గ్రామస్థుల సమస్యలు తీరుస్తాం: నిర్మల్ కలెక్టర్

image

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కొన్ని రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కడ్తాల్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థులు ఆందోళన చెందవద్దని, తప్పకుండా వారి సమస్యలను తీరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

Similar News

News February 19, 2025

KCR అధ్యక్షతన సమావేశం.. ‘కారు’లన్నీ అటువైపే!

image

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

News February 19, 2025

వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2025

ప్రకాశం జిల్లాలో విషాదం

image

ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీపంలోని చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సంతనూతలపాడుకు చెందిన బాపట్ల సుజాత(35), అశ్వజ్ఞ(6 నెలలు)గా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!