News April 25, 2024
కతర్లో నిర్మల్ వాసి మృతి.. ఇంటికి చేరిన మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713959305483-normal-WIFI.webp)
నిర్మల్ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెందిన గువ్వల రవి(23) సంవత్సరం క్రితం కతర్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ వారం రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దీంతో అతడి స్నేహితుల సాయంతో రవి కుటుంబీకులు తెలంగాణ గల్ఫ్ సమితిని ఆశ్రయించి మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని కోరారు. యాజమాన్యంతో మాట్లాడిన అధికారులు బుధవారం మృతదేహాన్ని గ్రామానికి రప్పించారు.
Similar News
News February 5, 2025
ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738759447417_50249255-normal-WIFI.webp)
ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738756129250_20476851-normal-WIFI.webp)
ఆదిలాబాద్లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747644415_51859030-normal-WIFI.webp)
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.