News March 31, 2025

కథలాపూర్‌లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (28) అనే యువతి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శృతి పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. శృతి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్సలు చేయించిన నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Similar News

News October 22, 2025

సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

image

సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్‌లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్‌కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.

News October 22, 2025

‘ప్రతి నియోజకవర్గంలో ఇసుక స్టాప్ పాయింట్ ఏర్పాటు చేయాలి’

image

సామాన్య ప్రజలకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుక స్టాప్ పాయింట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. నిర్మూలించిన బెల్టు షాపులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 22, 2025

ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ ముఖ్య సూచనలు

image

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు అంబేడ్కర్‌ కోనసీమ డీఐఈఓ సోమశేఖరరావు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. హాల్‌ టికెట్‌లోని పొరపాట్లను డీఐఈఓ ద్వారా సవరించుకోవాలన్నారు. సమాధానాలకు 24 పేజీల పుస్తకం మాత్రమే ఇస్తారని, ఫలితాలు వచ్చాక నెల తర్వాతే ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.