News January 26, 2025
కథలాపూర్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన కనికరపు నర్సయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. నిన్న తన భార్యతో గొడవ పడి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టగా.. ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News October 29, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఏర్పాటుకు కృషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో మెదక్ జిల్లాలోనూ వీటి ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,617 చెరువులు, 105 చెక్ డ్యాములు, మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 2 లక్షల 67 వేల ఎకరాల సాగుభూమి ఉంది, వీటికి సంఘాలు ఏర్పాటు చేయడంతో చెరువుల సంరక్షణ, సాగునీటి పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు రాజకీయ నిరుద్యోగులు సైతం తగ్గిపోయే అవకాశం ఉంది.
News October 29, 2025
వలిగొండలో విషాదానికి 20 ఏళ్లు

వలిగొండలో సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఘోర విషాదం జరిగింది. 2005 అక్టోబర్ 29న వలిగొండ వద్ద రైలు పట్టాలు తప్పి వాగులో పడిపోవడంతో 116 మంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన వరదతో పట్టాలపై చీలికలు ఏర్పడి రేపల్లె-సికింద్రాబాద్ డెల్టా ప్యాసింజర్ వాగులో పడిపోయింది. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో తీర విషాదాన్ని నింపింది.
News October 29, 2025
ఉప్పునుంతలలో 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటలలో NGKL జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతలలో 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. అచ్చంపేటలో 158.5, చారకొండ 133.8, ఊరుకొండలో 124.3, తెలకపల్లిలో 121.2, బల్మూరులో 120.7, వెల్దండలో 108.0, తాడూరులో 107.5, లింగాలలో 104.5, నాగర్ కర్నూల్లో 101.1, వంగూరులో 99.0 వర్షపాతం నమోదయింది.


