News January 26, 2025
కథలాపూర్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన కనికరపు నర్సయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. నిన్న తన భార్యతో గొడవ పడి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టగా.. ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 10, 2025
మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి!

కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు సంబంధించి 10 మద్యం షాపులకు మొత్తం 133 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తులను జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారుల పరిశీలన అనంతరం సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నవ్య లాటరీ పద్ధతిలో కేటాయించారు. 10 షాపులు దక్కించుకున్న వారి పేర్లను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
రంగరాజన్పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.
News February 10, 2025
ఇచ్చోడ: 53 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.