News April 12, 2025

కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్‌పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News November 24, 2025

చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

image

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్‌ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

News November 24, 2025

చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

image

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్‌ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

News November 24, 2025

పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

image

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్‌ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.