News March 3, 2025
కథలాపూర్ మండలంలో వదినపై మరిది గొడ్డలితో దాడి

కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యగండ్ల లక్ష్మిపై మరిది చిన్నరాజం ఇద్దరి మధ్య మొరం విషయంలో గొడవ జరిగింది. మాట మాట పెరిగడంతో మరిది యగండ్ల చిన్న రాజం వదిన తలపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో వదిన లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్?

రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రచిత్ సింగ్తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్ అయిన రచిత్తో హుమా ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.
News September 15, 2025
ANU: ఏపీ పీజీ సెట్ షెడ్యూల్ మార్పు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ పీజీ సెట్ – 2025 షెడ్యూల్లో మార్పులు జరిగాయని కన్వీనర్ ప్రొఫెసర్ రవికుమార్ తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 17 వరకు, ఆన్లైన్ సర్టిఫికెట్ ధ్రువీకరణను 18 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఈ నెల 20 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
News September 15, 2025
సంగారెడ్డి: 17 నుంచి స్వచ్ఛత ఉత్సవ్ కార్యక్రమాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.