News March 3, 2025
కథలాపూర్ మండలంలో వదినపై మరిది గొడ్డలితో దాడి

కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యగండ్ల లక్ష్మిపై మరిది చిన్నరాజం ఇద్దరి మధ్య మొరం విషయంలో గొడవ జరిగింది. మాట మాట పెరిగడంతో మరిది యగండ్ల చిన్న రాజం వదిన తలపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో వదిన లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
కర్నూలుకు పీఎం.. కడపకు భారీ పెట్టుబడులు

ఇవాళ ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ కడప జిల్లాలో భారీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప, నెల్లూరు సరిహద్దు నుంచి CS పురం వరకు 41 KM మేర 2 వరుసల హైవే, కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. మరోవైపు కడప ఉక్కుపై ప్రధాని స్పందించాలని పలువురు కోరుతున్నారు.
News October 16, 2025
పాలమూరు: నేడు PUలో 4వ స్నాతకోత్సవం

పాలమూరు వర్సిటీలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ.డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ Way2Newsతో ప్రత్యేకంగా తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొట్టమొదటిసారిగా గౌరవ డాక్టరేట్ను Dr.మన్నే సత్యనారాయణ రెడ్డికు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.
News October 16, 2025
జనగామ: యంగ్ ఇండియా బిల్లులు.. రూ.24 లక్షల పైనే..!

జిల్లాలోని 71 ఉన్నత, 9 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15 రోజుల పాటు ‘యంగ్ ఇండియా’ పేరిట నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల బిల్లులు రూ.24 లక్షల పైనే రావాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తమ సొంతంగా ఖర్చు చేశారు. నాలుగు నెలలైనా బిల్లులు రాకపోవడంతో వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.