News March 20, 2025

కదిరిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం దృష్ట్యా గురువారం కదిరిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నేటి సాయంత్రం నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు కదిరి పట్టణ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. అనంతపురం, హిందూపురం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు కుటాగుళ్ల, కొత్త బైపాస్ మీదుగా బెంగళూరు వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

Similar News

News March 28, 2025

NGKL: రేపు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం: పృథ్వీరాజ్

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ భవనంలో రేపు ఉదయం 10గంటలకు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం ఉంటుందని బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జి బండి పృథ్వీరాజ్ తెలిపారు. సమావేశం అనంతరం వాల్ పోస్టర్, కరపత్రం విడుదల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News March 28, 2025

NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.

News March 28, 2025

భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

image

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!