News February 15, 2025
కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్పై కేసు

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. నల్లగుట్టవీధికి చెందిన అశ్విని కుమారుడు భానుతేజ ఓ ప్రవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. స్కూల్లో టీచర్ మధు అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సమాధానం చెప్పలేదని కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలయ్యాయని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News January 5, 2026
భూములను సంరక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి: ఆదర్శ్

వనపర్తి జిల్లాలో గెజిట్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ భూములను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో 898.36 ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు అక్కడక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని సంరక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాల్సిందిగా కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
News January 5, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలపై భారత్ కలవరపాటు!

బంగ్లాదేశ్లో మార్చిలో జరిగే ఎన్నికలు భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, తాత్కాలిక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణాలుగా ఉన్నాయి. నిషేధిత అవామీ లీగ్ను జాతీయ పార్టీ BNP, జమాత్తో పాటుగా ఎన్నికల పోటీకి అనుమతించాలనే భారత్ కోరుకుంటోంది. స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగితే మైనారిటీలపై దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.
News January 5, 2026
గ్రామాభివృద్ధికి కూటమి కృషి చేస్తుంది: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్

గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉండి నియోజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సీసీ రోడ్డుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్రి, పాసర్ల శ్రీనివాస్, నాగేశ్వరావు, పండు, కూటమి నాయకులు ఉన్నారు.


