News March 16, 2025
కదిరి నరసింహ స్వామి సేవలో కలెక్టర్

కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లగా ఆలయ అర్చకులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ను ఘనంగా సన్మానించారు.
Similar News
News March 17, 2025
వైసీపీ పాలనలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి: పవన్

AP: వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రూ.250 కోట్ల అవినీతి జరిగిందని నివేదిక వచ్చిందని తెలిపారు. 564 మండలాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల చేస్తామని చెప్పారు.
News March 17, 2025
ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసింది: PM మోదీ

బంధాలు పునరుద్ధరించేందుకు భారత్ యత్నించిన ప్రతిసారీ పాక్ నమ్మకద్రోహమే చేసిందని PM మోదీ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. నా ప్రమాణ స్వీకారానికి అప్పటి పాక్ PM షరీఫ్ను ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయందించినా ఆ దేశం నమ్మకద్రోహమే చేసింది. వారు తెలివిగా ఆలోచించి ఏదో ఒకరోజు శాంతి బాటను ఎంచుకోవాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 17, 2025
తల్లి దశదినకర్మ రోజే విగతజీవిగా తనయుడు

మంగోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దశదినకర్మ రోజే తనయుడు విద్యుత్ ఘాతంతో విగతజీవిగా మారాడు. వివరాలిలా.. ముదిరాజ్ కాలనీకి చెందిన కొండ సత్తెవ్వ దశదినకర్మను కులసంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమపనుల్లో సమగ్నమైన కొడుకు కృష్ణభవనం ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్న సమయంలో కరెంట్షాక్కు గురై గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.