News March 16, 2025
కదిరి నరసింహ స్వామి సేవలో కలెక్టర్

కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లగా ఆలయ అర్చకులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ను ఘనంగా సన్మానించారు.
Similar News
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!
News November 25, 2025
కొరిశపాడు: ATMలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
News November 25, 2025
విశాఖ: ప్రియరాలి వేధింపులతో ఆత్మహత్య?

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలు వేధింపులే కారణమని యువకుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మిత్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


