News March 23, 2025

కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

image

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 6, 2025

హనుమకొండ డైట్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు

image

హనుమకొండ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎండీ అబ్దులై తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరించి, 15న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైనవారు ఈ నెల 17న రిపోర్టు చేయాలని, గౌరవ వేతనం రూ.15,600–23,400గా నిర్ణయించామని పేర్కొన్నారు.

News November 6, 2025

సత్యసాయి బాబా సూక్తులు

image

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.

News November 6, 2025

NZB: మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

image

నవీపేట్(M) ఫతేనగర్ శివారులో అక్టోబర్ 24న జరిగిన <<18089668>>మహిళ హత్య<<>> కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఫకీరాబాద్, కోస్గీ, మద్దేపల్లికి చెందిన సంగీత, మంగలి బాబు, పద్మ.. మృతురాలు శ్యామల లక్ష్మీ @ బుజ్జిని ఫతేనగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. డబ్బుల కోసం వారి మధ్య గొడవ జరిగిందని ACP వెల్లడించారు.