News February 11, 2025

కదిరి: వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

image

కదిరి అడపాల వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఆత్మహత్య కేసులో భర్త కేశవయ్యను అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన భర్త కేశవయ్య పెడుతున్న హింసలను తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం కేశవయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News February 12, 2025

పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

image

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.

News February 12, 2025

మంథని: సొమసిల్లి పడిపోయిన వృద్ధురాలు మృతి

image

మంథని పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో చీర్ల శంకరమ్మ (65) వృద్ధురాలు కూరగాయలు అమ్ముకుంటూ అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి వృద్ధురాలు మరణించినట్లు వెల్లడించారు. వృద్ధురాలిది భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంత కాలంగా మంథనిలో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

News February 12, 2025

సంగారెడ్డి: ముగిసిన క్రీడా పోటీలు

image

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిస్తాయి. కబడ్డి, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర మాజీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి కాసిం బేక్ విజేతలకు బహుమతులు అందించారు.

error: Content is protected !!