News December 22, 2024

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీతక్క

image

విజయవాడ కనకదుర్గా అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. స్థానిక నేతలు ఉన్నారు.

Similar News

News December 17, 2025

వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

image

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

News December 17, 2025

ఎంజీఎం వార్డులోకి కుక్క.. ఇద్దరికి షోకాజ్ నోటీసులు

image

వరంగల్ MGM ఆసుపత్రిలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. గతంలో ఎలుకలు కొరికిన ఘటన జరిగిన అదే వార్డులోకి తాజాగా ఒక కుక్క ప్రవేశించడం కలకలం రేపింది. రోగి బంధువులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో విధుల్లోని ఇద్దరు సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల వైఫల్యానికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 15, 2025

వరంగల్: ఇక ప్రాదేశిక స్థానాలపై కన్ను..!

image

జిల్లాలో రెండు విడుతల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, నాయకులు ప్రాదేశిక స్థానాలపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలను చేపట్టారు. ప్రాదేశిక స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.