News March 30, 2025

కనకదుర్గ దేవిని దర్శించుకున్న సింగరేణి జీఎం

image

రెబ్బెన మండలం కైరిగూడ ఉపరితల గని వద్దగల కనకదుర్గాదేవిని బెల్లంపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వా వాసు నామ ఉగాది సందర్భంగా ఘని వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్మికుల కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వీరితో ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైరిగూడ ప్రాజెక్ట్ ఆఫీసర్ M.నరేందర్ తదితరులున్నారు.

Similar News

News December 4, 2025

తిరుమల: దర్శనాల పేరుతో మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

image

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధుల పేరుతో నకిలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రికమండేషన్ లెటర్లు తయారుచేసి అమాయక భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

News December 4, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్‌(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్

News December 4, 2025

రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.