News March 30, 2025
కనకదుర్గ దేవిని దర్శించుకున్న సింగరేణి జీఎం

రెబ్బెన మండలం కైరిగూడ ఉపరితల గని వద్దగల కనకదుర్గాదేవిని బెల్లంపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వా వాసు నామ ఉగాది సందర్భంగా ఘని వద్ద ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్మికుల కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వీరితో ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైరిగూడ ప్రాజెక్ట్ ఆఫీసర్ M.నరేందర్ తదితరులున్నారు.
Similar News
News December 24, 2025
టుడే హెడ్లైన్స్

*AP నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ గెలిస్తే రూ.100 కోట్లు: CM చంద్రబాబు
*TDP-JSP చెప్పినవి అబద్ధాలని RBI డేటాతో తేలింది: జగన్
*కొత్త సర్పంచులు మంచి పాలన అందించాలి: CM రేవంత్
*KCR గర్జిస్తే సమాధానం చెప్పే దమ్ము CMకి లేదు: KTR
*TGలో DEC 31 అర్ధరాత్రి వరకు వైన్స్, 1AM వరకు బార్స్
*భారత్లో 3 కొత్త ఎయిర్ లైన్స్: కేంద్రమంత్రి రామ్మోహన్
*శ్రీలంక ఉమెన్స్పై రెండో టీ20లో భారత్ ఘన విజయం
News December 24, 2025
భారత్ అండర్-19 జట్టుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్ టీమ్ తీరుపై ICCకి కంప్లైంట్ చేయనున్నట్టు PCB, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెప్పారు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నారు. పాలిటిక్స్, స్పోర్ట్స్ను వేరుగా చూడాలి. భారత ఆటగాళ్ల తీరుపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో అండర్-19 ఆసియా కప్ను పాక్ గెలుచుకుంది.
News December 24, 2025
జగిత్యాల జిల్లాలో పెరిగిన హత్యలు: ఎస్పీ

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు. ఈ క్రమంలో సహకరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.


