News August 12, 2024
కనిగిరి: గ్రానైట్ బండరాయి పడి లారీ డ్రైవర్ మృతి

గ్రానైట్ బండరాయి పడి లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కనిగిరి పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్సై త్యాగరాజు వివరాల ప్రకారం… పట్టణంలోని ఓ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ బండరాయిని క్రేన్ తో లారీ పైకి లోడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒరిగి లారీ డ్రైవర్ రత్తయ్యపై పడింది. గాయాలైన రత్తయ్యను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News September 16, 2025
ప్రకాశం: రాక్సీ వచ్చేసింది.. గంజా నేరగాళ్లకు ఇక చుక్కలే.!

నేరాల నియంత్రణలో పోలీస్ జాగిలాలు నిర్వహించే విధులను అభినందించాల్సిందే. అలాంటి చురుకైన జాగిలం రాక్సీ ప్రకాశం పోలీసుల చెంతకు చేరింది. ప్రత్యేక శిక్షణతో గంజాయిని వాసనతో పసిగట్టడం దీని ప్రత్యేకత. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాక్సీని పోలీసులు రంగంలోకి దించారు. తొలి ప్రయత్నంలోనే గంజా ముఠా ఆటకట్టించింది. <<17720866>>సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో<<>> రాక్సీ సైలెంట్గా గంజాయి బ్యాగులను గుర్తించింది.
News September 16, 2025
ప్రకాశం: ప్రభుత్వ కళాశాలలో వికృతి చేష్టలు.. ఐదుగురిపై వేటు

ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంతో సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ తాడేపల్లికి వెళ్లారు. ఈ దశలోనే కలెక్టర్ల సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.