News July 24, 2024

కనిగిరి ఘోర ప్రమాదంపై ఏఈ స్పందన

image

కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో విద్యుత్ అధికారుల తప్పు లేదని ఏఈ రసూల్ స్పష్టం చేశారు. ఈదురు గాలుల వల్ల 11కేవీ వైర్ తెగి చిల్లచెట్లపై పడటంతో ఫీడర్ ట్రిప్ కాలేదని అన్నారు. అదే సమయంలో ముగ్గురు విద్యార్థులు స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వైర్ తగిలి ప్రమాదం జరిగిందన్నారు. ఘటన తనని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ తర్వాత తప్పు తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 25, 2025

ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

image

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.

News November 25, 2025

ప్రకాశం: ఉద్యానవన సాగు రైతులకు గుడ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాలో ఉద్యానవన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంగళవారం ఉద్యానవన శాఖలపై సమీక్షించిన సందర్భంగా ప్రకాశం జిల్లా రైతుల విషయంపై సైతం మాట్లాడారు. రాయలసీమ, ప్రకాశంలో 92 క్లస్టర్లద్వారా ఉద్యానవన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు.

News November 25, 2025

అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

image

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.