News March 23, 2025

కనిగిరి: బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు లోకేశ్.. ఎప్పడంటే.!

image

AP ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా.. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేస్తారు.

Similar News

News October 25, 2025

కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

image

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

News October 25, 2025

కర్నూలు ఎఫెక్ట్.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులకు హడల్..!

image

కర్నూల్‌లో ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నేషనల్ హైవేలలో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్ బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సాగాయి.

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.