News September 25, 2024
కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.
News November 23, 2025
వాహనదారులకు ప్రకాశం పోలీస్ కీలక సూచనలు.!

*హైవేల్లో భారీ ప్రమాదాలకు కారణం నిద్ర మత్తు
*నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ
*మీతోపాటు ప్రయాణికుల, పాదచారుల ప్రాణాలకు ముప్పు
*నిద్రమత్తు అనిపిస్తే వెంటనే వాహనం సైడుకు ఆపి 10-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి
*ప్రయాణం మొదలు పెట్టే ముందు సరిపోయేలా నిద్రపోవాలి
*దీర్ఘ ప్రయాణాల్లో 2 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.
*వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించండి.
News November 23, 2025
ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.


