News November 9, 2024

కనిగిరి: వదిన గొంతు కోసిన మరిది

image

బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణంలోని గార్లపేట రహదారిలోని హోటల్‌లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 12, 2025

ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

image

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 12, 2025

ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 12, 2025

ప్రకాశం జిల్లా TDP అధ్యక్ష పదవి.. ఛాన్స్ ఉగ్రాకేనా?

image

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇంకా భర్తీ కాని విషయం తెలిసిందే. కొన్ని నెలలక్రితం ఇక అధ్యక్ష పదవి భర్తీ అవుతుందని క్యాడర్ భావించినా TDP అధిష్ఠానం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, అధిష్ఠానం రాజకీయ సమీకరణాల ప్రకారం నిర్ణయం తీసుకోనుందట. తాజాగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి పేరు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీ కామెంట్.