News April 24, 2024
కనిగిరి: 10వ తరగతిలో కవలలకు ఒకే మార్కులు

కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.
Similar News
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.
News January 8, 2026
త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.
News January 8, 2026
ప్రకాశంలో మొదలైన సంక్రాంతి సందడి

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కొన్ని కళాశాలల్లో భోగి మంటలు వేసి విద్యార్థులకు పండగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు.


