News January 16, 2026

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

image

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.

Similar News

News April 20, 2026

ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే: ప్రభుత్వం

image

AP: GOVT ఉద్యోగాల్లో 95%పోస్టులు స్థానికులకే కేటాయించనున్నారు. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వం GO45 జారీ చేసింది. రాష్ట్రాన్ని 6జోన్లుగా, 2మల్టీ జోన్లుగా చేసింది. ఆయా క్యాడర్ పోస్టుల్లో 95% లోకల్‌కు, మిగతావి జనరల్ కోటాలో భర్తీ చేస్తారు. లోకల్‌గా పరిగణించాలంటే క్వాలిఫయింగ్ ఎగ్జామ్ వరకు వరుసగా 4ఏళ్లు జిల్లాలో చదివి ఉండాలి. లేదా పేరెంట్స్ 4ఏళ్లు నివాసం ఉండాలి.

News April 20, 2026

అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా?.. విజయ్‌కి హైకోర్టు నోటీసులు

image

TVK అధినేత విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. EC, IT శాఖకూ నోటీసులిచ్చింది. ‘విజయ్ ఎన్నికల వివరాల్లో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నాయి. తిరుచ్చి తూర్పు అఫిడవిట్‌లో తన చరాస్తులు ₹224 కోట్లుగా, పెరంబూర్ అఫిడవిట్‌లో ₹105 కోట్లుగా చూపించారు. ₹100 కోట్ల తేడా ఉంది’ అని పిటిషనర్ వి.విఘ్నేశ్ ఆరోపించారు.

News April 20, 2026

శాంతి చర్చలకు వెళ్లం.. స్పష్టం చేసిన ఇరాన్

image

అమెరికాతో రెండో విడత శాంతి చర్చలకు వెళ్లేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం అతిత్వరలో ఇస్లామాబాద్ వేదికగా 2 దేశాలు మరోసారి చర్చలు జరపాల్సి ఉంది. కానీ అమెరికా సీజ్‌ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో తాము చర్చలకు రాబోమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి యుద్ధం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడనుంది.