News March 28, 2025

కన్నడ భక్తులు రైలు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎంపీ

image

శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కర్ణాటక మహారాష్ట్ర నుంచి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో పాదయాత్రగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తుల తిరుగు ప్రయాణం కోసం మార్కాపురం, నంద్యాల మీదుగా ఏర్పాటు చేసిన గుంటూరు-హుబ్లీ ప్రత్యేక రైలు సర్వీసులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం పేర్కొన్నారు. అలాగే రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 2, 2025

‘మెగా పీటీఎం 3.O‌కు రూ.9.84 కోట్లు కేటాయింపు’

image

ఈనెల 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ డే (పి.టి.ఎం 3.0) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.84 కోట్లు కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 45,190 సర్కారు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం(D) భామిని ఏపీ మోడల్ స్కూల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు.

News December 2, 2025

దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

image

దిత్వా తుఫాన్‌ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.

News December 2, 2025

గద్వాల: సైబర్ నేరాలపై అవగాహన ప్రచారం: ఎస్పీ

image

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిజిటల్ ప్రపంచంలో భద్రత పౌరుని హక్కు అని ఆయన అన్నారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ అవగాహన శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.