News February 8, 2025
కన్నాయిగూడెం: ఉర్సు ఉత్సవాలకు రావాలని సీతక్కకు ఆహ్వానం

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగే ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు రావాలని స్థానిక ముస్లిం సోదరులు మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. నజీరుద్దీన్, మునీర్, షాయక్ మాట్లాడుతూ.. ఉర్సు షరీఫ్ ఉత్సవాలు జరిగే దర్గా వద్ద విద్యుత్ సరఫరా చేయాలని, దర్గా దగ్గరకు వెళ్లేందుకు నూతన రోడ్డు మంజూరు చేయాలని సీతక్కను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో అప్సర్ పాషా, గౌస్, అజ్జు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెంచాలి: భూపాలపల్లి కలెక్టర్

విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంపొందించడంతోపాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ బోధన అలాగే ఫౌండేషన్ అందించే సామగ్రి అన్ని పాఠశాలలకు చేరాలన్నారు.
News November 27, 2025
తిరుమల: 4.63 లక్షల డిప్ రిజిస్ట్రేషన్లు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన డిప్ రిజిస్ట్రేషన్కు రికార్డు స్థాయిలో భక్తులు స్పందించారు. తొలి గంటలోనే 2.16 లక్షలు నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 4,63,111 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు ఏపీ ప్రభుత్వ వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ-డిప్లో టోకెన్ పొందిన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం వస్తుంది.
News November 27, 2025
జనగామ: మొదటి రోజు 44 వార్డు స్థానాలకు నామినేషన్ల దాఖలు

జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్పల్లి, జాఫర్గఢ్, లింగాల గణపురం 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చిల్పూర్-10, స్టేషన్ ఘనపూర్-7, రఘునాథ్పల్లి-8, జాఫర్గఢ్-8, లింగాల గణపురం-11 వార్డ్ స్థానాలకు నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 44 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు.


