News February 8, 2025

కన్నాయిగూడెం: ఉర్సు ఉత్సవాలకు రావాలని సీతక్కకు ఆహ్వానం

image

కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగే ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు రావాలని స్థానిక ముస్లిం సోదరులు మంత్రి సీతక్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. నజీరుద్దీన్, మునీర్, షాయక్ మాట్లాడుతూ.. ఉర్సు షరీఫ్ ఉత్సవాలు జరిగే దర్గా వద్ద విద్యుత్ సరఫరా చేయాలని, దర్గా దగ్గరకు వెళ్లేందుకు నూతన రోడ్డు మంజూరు చేయాలని సీతక్కను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో అప్సర్ పాషా, గౌస్, అజ్జు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

image

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.

News November 28, 2025

SVUలో ర్యాగింగ్.. హైకోర్టు కీలక తీర్పు

image

SVU సైకాలజీ డిపార్ట్మెంటులో జూనియర్లపై HOD ఆదేశాలతో సీనియర్లు <<18239778>>ర్యాగింగ్<<>> చేయగా.. అప్పట్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని పరిశోధక విద్యార్థి అశోక్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కోర్టు వర్సిటీ అధికారులకు నోటీసులు పంపమని ఆదేశించినట్లు అశోక్ పేర్కొన్నారు.

News November 28, 2025

సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

image

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.