News March 26, 2025
కన్నేపల్లిలో ముగ్గురు అరెస్ట్.. ఏడుగురు పరారీ

కన్నేపల్లి మండలం ముత్తాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ గంగారాం తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పారిపోయినట్లు వెల్లడించారు. వారి వద్ద రూ.1500 నగదు, 2ఆటోలు, 2 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 27, 2025
హైదరాబాద్ బిర్యానీ తగ్గేదేలే!

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే బెస్ట్ ఫుడ్ జాబితాలో HYD బిర్యానీ ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఫుడ్ గైడ్ టెస్ట్ అట్లాస్ జాబితా ‘50 ఉత్తమ బియ్యం వంటకాలు- 2025’లో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో ఇది వెల్లడైంది. మొదటి 9స్థానాల్లో నెగిటోరోడాన్, సూషి, కైసెండన్, ఒటోరో నిగిరి, చుటోరో నిగిరి, నిగిరి, మాకి నిలిచాయి. ఇంతకీ HYDలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది.
News November 27, 2025
KNR: ‘వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి.’

కరీంనగర్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన TMKMKS రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి గురువారం గోరింకల నరసింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తె.మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ హాజరై మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని, ప్రతి మత్స్య సొసైటీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
News November 27, 2025
ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పౌరసరఫరాల అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, గోనెసంచులు తదితర అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


