News February 1, 2025
కపిలేశ్వరపురం: ఆర్టీసీ బస్సు కింద పడి వృద్దురాలు మృతి

కపిలేశ్వపురం మండలం అంగరలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పెన్షన్ తీసుకోవడానికి ఎండగండి గ్రామానికి వెళ్లేందుకు వాడపల్లి భద్రం అంగర గాంధీ సెంటర్లో బస్సు ఎక్కుతూ కాలు జారి బస్సు కింది పడ్డారు. బస్సు వెనక చక్రాలు మీద నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అంగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News October 22, 2025
వరంగల్: ఆకతాయిలు వేధిస్తే సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత కోరారు. సుబేదారిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.
News October 22, 2025
నాగులచవితికి విశాఖ జూ పార్కు వేళల్లో మార్పు!

నాగులచవితి పండగ సందర్భంగా విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ వేళల్లో మార్పులు చేశారు. శనివారం రోజు సందర్శకుల కోసం పార్కును సాధారణ సమయం కంటే ముందుగా ఉదయం 7:30 గంటలకే తెరవనున్నట్లు క్యూరేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ లోపల పటాకులు, పేలుడు పదార్థాలు వంటి నిషేధిత వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News October 22, 2025
బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.