News March 29, 2025
కబ్జా కోరల్లో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ.?

ఉదయగిరి RTC డిపో సమీపంలో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ భవనం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపించారు. మార్చురీ భవనానికి సంబంధించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లను తొలగించి, చదును చేసి ఆక్రమించేందుకు హద్దు రాళ్లు ఏర్పాటు చేశారన్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి CHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్.. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 16, 2025
మర్రిపాడు: హైవేపై ఘోర ప్రమాదం.. 10మందికి గాయాలు

మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 15, 2025
సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల

పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు. చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.


