News October 15, 2024
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Similar News
News October 15, 2024
బాణసంచా దుకాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి: సీపీ
ఖమ్మం జిల్లాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారస్తులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం లోపు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకొని, అనుమతి పొందాలని సూచించారు. పోలీస్ శాఖ, నగర పాలక శాఖ, అగ్నిమాపక శాఖలు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 15, 2024
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT
News October 15, 2024
ఖమ్మం: ఓ పెయింటర్ ఆవేదన..!
ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో రోజువారీ కూలీలు, పెయింటింగ్ పనులు చేసేవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో పెయింటర్ చిర్ర సురేశ్ మాట్లాడుతూ.. 2 నెలల నుంచి నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయని, వంట నూనె, వెల్లుల్లి, టమాట ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితి తమదని, రేట్లు తగ్గించాలని కోరారు.