News July 29, 2024
కమలాపురం: పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

సుమారు 75 మందిని మోసం చేసిన ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు. కమలాపురానికి చెందిన కైప నాగేంద్రప్రసాద్ శర్మ తక్కువ ధరలకే కార్లు, భూములు ఇప్పిస్తానని చెప్పి రూ.12.83కోట్లు దండుకున్నాడు. ఇతడిని 2021లో KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై బయటికి వచ్చి తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ చేద్దామని వస్తే వాగ్వాదం పెట్టుకునేవాడు. బెంగళూరులో ఉన్న అతడిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండుకు తరలించారు.
Similar News
News January 6, 2026
2వ సెట్ను కూడా కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. రెండో సెట్లోనూ ఏపీ టీం విజయం సాధించింది. <<18778904>>మొదటి<<>> సెట్లోనే విజయం సాధించడంతో 2-0 తో ముందంజలో ఉంది. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.
News January 6, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.


