News October 4, 2024

కమలాపురం: భూ తగాదాల్లో తోపులాట.. వ్యక్తి మృతి

image

కమలాపురం మండల పరిధిలోని అప్పారావుపల్లెలో భూ తగాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో శీలం కృష్ణారెడ్డి (65) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బావా బామర్దుల మధ్య భూమి విషయంలో జరిగిన వాదనలు తోపులాటకు దారితీశాయి. ఈ సందర్భంలో కృష్ణారెడ్డికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే కమలాపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News November 21, 2025

కడపలో నేడు వాహనాల వేలం

image

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.

News November 21, 2025

కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

image

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.

News November 21, 2025

కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

image

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.