News September 24, 2024
కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కమలాపురం మండలం పందిళ్ళపల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 5, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
* వెండి 10 గ్రాముల ధర: రూ.2450.
News January 4, 2026
కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News January 4, 2026
జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలు.. ఏపీ టీం ఇదే.!

69వ జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు జమ్మలమడుగులో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏపీ టీం ఇదే.!
C. నవీన, R. మనస్వి, Y. నందిని, K. శ్యామలాదేవి, అవంతి, V. జాస్మిన్, P. లాస్య, M. అశ్వని, K. జెసికా, V. వందన, K. తేజస్వి, J. నాగూర్బి. కోచ్ ఎం. దేవిక, మేనేజర్గా బీవీ రమణయ్య వ్యవహరించనున్నారు. ఈ పోటీలకు జమ్మలమడుగులోని బాలికల ఇంటర్ కాలేజీ ఆతిథ్యం ఇవ్వనుంది.
>> ALL THE BEST TEAM AP


