News September 24, 2024

కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కమలాపురం మండలం పందిళ్ళపల్లె గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమకూరకు చెందిన కారు, కడపకు చెందిన ఆటో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు కడపకు చెందిన షేక్ అబ్దుల్ హసన్ (23)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 16, 2025

క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

image

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News December 16, 2025

కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

News December 16, 2025

ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి సస్పెన్షన్.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓబులేసును సస్పెండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీసీగా, అజెండా క్లర్క్‌గా ఓబులేసు విధులు నిర్వహిస్తున్నాడు. పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలపై అక్కడి మేనేజర్ ప్రవీణ్‌పై కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపారు.